వీటిలో బోధన, బోధనేతర పోస్టులున్నాయి.
నవంబరు 10 నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేయాలని ఎస్ఎ్సఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఆర్సీ-5101) జారీ చేశారు.
జిల్లాల వారీగా పోస్టులు:
శ్రీకాకుళం(207),
విజయనగరం(147),
విశాఖపట్నం(242),
తూర్పుగోదావరి(235),
పశ్చిమగోదావరి(97),
కృష్ణా(141),
గుంటూరు(221),
ప్రకాశం(76),
నెల్లూరు(132),
చిత్తూరు(483),
కడప(105),
అనంతపురం(117),
కర్నూలు(176).
పోస్టుల భర్తీకి జిల్లాస్థాయిలో ప్రాజెక్టు ఆఫీసర్లు, జిల్లా విద్యాధికారి, డైట్ ప్రిన్సిపాళ్లతో కమిటీలు వేయాలన్నారు.
సీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్(ఎస్వో) వంటి టీచింగ్ పోస్టులను 100 మార్కులకు ఆబ్జెక్టివ్ మోడల్లో రాత పరీక్ష నిర్వహించాలని, అందులో మెరిట్ ప్రాతిపదికగా.. జిల్లా స్థాయి రోస్టర్ను పాటిస్తూ భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చారు.
2018 జూలై 1 నాటికి 39 ఏళ్లు మించని అభ్యర్థులు అర్హులని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు, దివ్యాంగులకు 49 ఏళ్లుగా నిర్ణయించారు.
నాన్ టీచింగ్ పోస్టులను కలెక్టర్ పర్యవేక్షణలోని జిల్లాస్థాయి కమిటీలతో భర్తీచేస్తారు.
0 Comments
Please add your comment here