దరఖాస్తు చేసుకున్న వారందరికీ తొలుత ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తారు. వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. బహుళైచ్ఛిక విధానం(ఆబ్జెక్టివ్)లో ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. గణితం, రీజనింగ్, జనరల్ స్టడీస్వంటి అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. మూడు గంటల వ్యవధిలో రాయాలి. ఓసీ అభ్యర్థులు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ విశ్రాంత సైనికోద్యోగులు 30 శాతం మార్కులు పొందితే తదుపరి దశకు అర్హులవుతారు. ప్రాథమిక రాత పరీక్షలో ఎంపికైన వారికి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక రాత పరీక్ష అర్హత పరీక్ష మాత్రమే. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. కాకినాడ జేఎన్టీయూకు పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. మార్చినాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నారు.
విభాగాలవారీ ఖాళీలు:
పోస్టు - భర్తీ చేసే పోస్టుల సంఖ్య
సివిల్ కానిస్టేబుల్ - 1,600
ఏఆర్ కానిస్టేబుల్ - 300
ఏపీఎస్పీ కానిస్టేబుల్ - 300
ఫైర్మెన్ - 400
జైలు వార్డర్లు (పురుషులు) - 100
జైలు వార్డర్లు (మహిళలు) - 23
మొత్తం - 2,723
వయోపరిమితి
* సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు: 18-22 ఏళ్ల మధ్య వయసుండాలి
* జైలు వార్డర్లు (మహిళలు, పురుషులు), ఫైర్మెన్ పోస్టులకు: 18-30 ఏళ్లు
* ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు
* సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుల్, ఫైర్మెన్లకు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
* ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివి పరీక్షలు రాసుంటే సరిపోతుంది.
* జైలు వార్డర్లు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవాలి.
ముఖ్యమైన తేదీలు
* దరఖాస్తుల స్వీకరణ: 12.11.2018 (సోమవారం) నుంచి ప్రారంభమైంది.
* దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: 2018 డిసెంబరు 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ
* ప్రాథమిక రాత పరీక్ష: 2019 జనవరి 6 ఆదివారం ఉదయం పదింటినుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ
* శారీరక దారుఢ్య పరీక్షలు: 2019 ఫిబ్రవరి 9- 2019 ఫిబ్రవరి 20 మధ్య
* తుది రాత పరీక్ష: 2019 మార్చి 3న
దరఖాస్తుల స్వీకరణ: ఆన్లైన్లో స్వీకరిస్తారు. (http://slprb.ap.gov.in/) వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ వెబ్సైట్: http://pc.apprb.in/
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్స్ నోటిఫికేషన్ 2018
0 Comments
Please add your comment here