⇾ అపరాధ రుసుం లేకుండా : పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు రుసుం చెల్లించేందుకు గడువును నవంబర్ 30 వరకు పెంచారు.
⇾ విద్యార్థులు చెల్లించే పరీక్ష రుసుమును సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సీఎఫ్ఎంఎస్ విధానంలో చెల్లించేందుకు డిసెంబరు 1 వరకు గడువు విధించారు.
⇾ రూ.50 అపరాధ రుసుంతో: నిర్ణీత గడువు అనంతరం రూ.50 అపరాధ రుసుంతో పరీక్ష రుసుం చెల్లించేందుకు డిసెంబరు 15 వరకు గడువు విధించారన్నారు.
⇾ విద్యార్థులు చెల్లించే పరీక్ష రుసుమును సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సీఎఫ్ఎంఎస్ విధానంలో చెల్లించేందుకు డిసెంబరు 17 వరకు గడువు విధించారు.
⇾ రూ.200 అపరాధ రుసుంతో: విద్యార్థులు రూ.200 అపరాధ రుసుంతో పరీక్ష రుసుం చెల్లించేందుకు డిసెంబరు 24 వరకు గడువు విధించారు.
⇾ విద్యార్థులు చెల్లించే పరీక్ష రుసుమును సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సీఎఫ్ఎంఎస్ విధానంలో చెల్లించేందుకు డిసెంబరు 27 వరకు గడువు విధించారు.
⇾ రూ.500 అపరాధ రుసుంతో: విద్యార్థులు రూ.500 అపరాధ రుసుంతో పరీక్ష రుసుం చెల్లించేందుకు 2019 జనవరి 3 వరకు గడువు విధించారని తెలిపారు.
⇾ విద్యార్థులు చెల్లించే పరీక్ష రుసుమును సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సీఎఫ్ఎంఎస్ విధానంలో చెల్లించేందుకు జనవరి 4 వరకు గడువు విధించారు.
0 Comments
Please add your comment here